Rukmini Vasanth : కన్నడ నటి రుక్మిణి వసంత్ దక్షిణాది సినిమాలకు పెరుగుతున్న క్రేజ్‌పై తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. “సప్త సాగరాలు దాటి” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె, తమిళ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రుక్మిణి మాట్లాడుతూ, “కేజీఎఫ్‌, కాంతార, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమాల విజయం తర్వాత దక్షిణాది సినిమాలపై దృష్టి పెరిగిందని” చెప్పింది. “బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు మన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రాల ద్వారా వైవిధ్యమైన కథలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇది నటీనటులకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తోంది” అని ఆమె అన్నారు.

“నేను నటిని కాకపోతే టీచర్ అయ్యేదాన్ని. కానీ సినిమాల్లోకి వచ్చాక నా జీవితం పూర్తిగా మారిపోయింది. ‘సప్త సాగరాలు దాటి’ నాకు గుర్తింపు తెచ్చిపెట్టి, అవకాశాల ద్వారాలు తెరిచింది. ఇతర భాషల్లో నటిస్తున్నప్పుడు, ఆయా భాషలపై నాకు ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. భాష నేర్చుకోవడంతో పాటు, అక్కడి ప్రేక్షకులకు నచ్చేలా నటించడం కూడా నాకు ముఖ్యం” అని రుక్మిణి వివరించారు.ప్రస్తుతం తమిళంలో “ఎస్‌కే 23”, “ఏస్‌” సినిమాల్లో నటిస్తున్న రుక్మిణి, త్వరలోనే రవితేజ సరసన నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Leave a comment

error: Content is protected !!