కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.
తాజాగా కంగనా కరోనాపై వ్యతిరేక పోరాటంలో తవ వంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేసినట్టు ఆమె సోదరి రంగోళి తెలిపింది. కంగనా రనౌత్ తల్లి ఆశా తన నెల పెన్షన్‌ను ప్రధాన మంత్రి సహాయ నిధికి అంజేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశ ప్రజలకు అండగా ఉండాలని ఎవరికి తోచినంత సహాయం చేయాలని పిలుపునిచ్చారు. మొత్తానికి కరోనా వ్యతిరేక పోరాటంలో ఎవరికి వారు తమకు తోచిన సాయం చేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!