దక్షిణాది సినిమా ప్రేమికులందరూ పండగచేసుకొనే ఒక అప్డేట్ వచ్చింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ , బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కబోతోంది అనే వార్త సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కోసం ఇప్పటికే కమల్ హాసన్, సల్మాన్ ఖాన్‌లతో చర్చలు జరుగుతున్నట్టు టాక్. వీరిద్దరూ ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి ఆసక్తి చూపించడంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు అక్టోబర్ లో ప్రారంభం కానున్నాయి. తర్వాత 2025 జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అట్లీ ఈ చిత్రాన్ని మునుపెన్నడూ చూడని భారీ యాక్షన్ చిత్రంగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కథను ఫైనలైజ్ చేసే పనులు జరుగుతున్నాయి.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘సికందర్’ చిత్రంలోనూ, కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాత అట్లీ చిత్రానికి జాయిన్ అవుతారు. కమల్ హాసన్ అండ్ సల్మాన్ ఖాన్‌లను ఒకే తెరపై చూడాలనేది సినీ ప్రేమికుల ఎప్పటినుండో ఉన్న కోరిక.

Leave a comment

error: Content is protected !!