లాస్టియర్ టాలీవుడ్ లో ‘సీత, రణరంగం’ చిత్రాలతో నిరాశ చెందినా.. ‘కోమాలి’ మూవీతో కోలీవుడ్ లో కాస్తంత ఊపిరిపీల్చుకుంది అందాల కాజల్ అగర్వాల్.  ఇక ఈ ఏడాది తెలుగుతో పాటు మలయాళం, హిందీ చిత్రాల్లో సరికొత్తగా మెరవనుంది అమ్మడు. ఇదిలా ఉంటే.. కాజల్ అగర్వాల్ ఇప్పుడు మరో అరుదైన ఘనత దక్కించుకోవడం అంతటా ఆసక్తిగా మారింది. అమ్మాయిగారు.. సింగపూర్ లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ లో మైనపు బొమ్మగా మారిపోయింది.

లాస్టియర్ డిసెంబర్ మూడో వారంలో సోషల్ మీడియాలో మేడమ్ టుస్సాడ్స్ లో తన మైనపు బొమ్మ చేరబోతున్నట్టుగా ప్రకటించి.. అభిమానుల్ని భలేగా ఖుషీ చేసింది కాజల్ అగర్వాల్. టుస్సాడ్స్ మ్యూజియమ్ లో స్థానం సంపాదించుకున్న మొట్టమొదటి దక్షిణాది కథానాయికగా అమ్మడు ఈ ఘనతను దక్కించుకుంది.  ఈ రోజు కాజల్ మైనపు బొమ్మ సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ లోకి చేరింది. గతంలో శ్రీదేవి, అనుష్కశర్మ, ప్రభాస్, మహేశ్ బాబు , కరణ్ జోహార్ లాంటి మేటి భారతీయ సినిమా పెర్సనాలిటీస్ మైనపు బొమ్మలుగా మారి.. గౌరవాన్నిపొందితే.. ఇప్పుడు అందాల కాజల్ కూడా మైనపు బొమ్మగా మారడం టాలీవుడ్ లో విశేషంగా మారింది.

Leave a comment

error: Content is protected !!