కరోనా వల్ల కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోడానికి మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ‘మనకోసం’ను ప్రారంభించారు. ఇప్పటికే ఈ సంస్థకు సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న పెద్ద అని తేడా లేకుండా పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు. కానీ ఒకరిద్దరు హీరోయిన్స్ తప్ప స్టార్ హీరోయిన్స్ ఎవరూ ఇంతవరకు కరోనా క్రైసిస్ ఫండ్ కు విరాళం ఇవ్వడానికి ముందుకు రాలేదని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముందుకొచ్చి తన మంచి మనసు చాటుకుంది.

కరోనా క్రైసిస్ ఛారిటీకి కాజల్ అగర్వాల్ 2 లక్షలు విరాళం ఇచ్చింది. స్టార్ హీరోయిన్లు చాలా మంది తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నటిస్తున్నారు. దీంతో ఒక ఛారిటీకి విరాళం ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే ఆ తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో చాలా మంది వెనకడుగు వేస్తున్నట్లుగా చెప్పారట. అంతేకాకుండా ఇప్పుడు ఇచ్చిన ఫండ్ కూడా తనకు తెలుగు ఇండస్ట్రీ మీద ఉన్న అభిమానంతో.. తాను ఈ ఇండస్ట్రీ నుంచే పైకి ఎదగడంతో.. కాజల్ మిగతా ఇండస్ట్రీలు గురించి ఆలోచించకుండా ఈ ఛారిటీకి సాయం చేసినట్లుగా తెలిపారట. ఏదేమైనా వారికి తోచిన విధంగా సాయం చేయడానికి ముందుకొస్తున్న వారిని అభినందించాలి. మరి కాజల్ అగర్వాల్ ని చూసైనా ఇప్పటికైనా మిగిలిన స్టార్ హీరోయిన్స్ కరోనాపై సాయానికి ముందుకొస్తారేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!