డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎక్కువగా యాక్షన్ చిత్రాల్నే తెరకెక్కించారు. ఆయన కెరీర్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఆయన మలిచిన ఒక డైనమిక్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘జ్యోతిలక్ష్మి’. అందాల చార్మి కౌర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా లో సత్యదేవ్ మరో ముఖ్యపాత్రను పోషించాడు. శ్రీ శుభా శ్వేతా ఫిల్మ్స్, సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా 2015, జూన్ 12న విడుదలై.. ఘన విజయం సాధించింది. ఈ సినిమా నేటికి సరిగ్గా 5 ఏళ్ళు పూర్తి చేసుకుంది. బాలీవుడ్ మూవీ సడక్ ఛాయలు కలిగిన ఉన్న ఈ సినిమా నిజానికి మల్లాది వెంకట కృష్ణ మూర్తి నవల మిసెస్ పరాంకుశం ఆధారంగా తెరకెక్కింది.

జ్యోతి లక్ష్మి అనే ఒక వేశ్యను సత్య అనే కుర్రోడు పెళ్ళిచేసుకోవాలని భావించి.. ఆమెను ఆ నరకకూపం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో జరిగిన అనూహ్య సంఘటనల సమాహారమే ఈ సినిమా కథాంశం. ఛార్మి కౌర్ అద్భుతమైన నటన, సత్యదేవ్ డైనమిక్ యాక్టింగ్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్ . బ్రహ్మానందం, ఉత్తేజ్, అజయ్ ఘోష్, అజీజ్ నాజర్,  అపూర్వా శ్రీనివాసన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఛార్మి కెరీర్ లోనే ఒక ప్రత్యేకమైన చిత్రం గా నిలిచిపోయింది.

 

Leave a comment

error: Content is protected !!