టాలీవుడ్ లో నిన్నమొన్నటి వరకూ పెద్ద వార్తగా నిలిచిన మలయాళ థ్రిల్లర్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’.  ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని, అందులో బాలయ్య, రానా హీరోలని రకరకాలుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అసలు ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతుందో లేదో… ఒక వేళ రీమేక్ చేస్తే ఎవరు హీరోలుగా నటిస్తారన్న విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఇంతలో..  సందట్లో సడేమియా గా ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పైగా  అందులో హీరోగా జాన్ అబ్రహం నటిస్తూండడం ఇంకా పెద్ద షాక్. 

సచి దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై ఘనవిజయం సాధించింది. అలాంటి  ఈ  సినిమా హిందీ రీమేక్‌ హక్క్లుల్ని బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా జాన్‌ అబ్రహాం ట్విట్టర్లో సినిమా గురించి మాట్లాడుతూ..‘‘అయ్యప్పనుమ్‌ కోషియుం’ చిత్రం యాక్షన్‌, థ్రిల్లర్‌గా బాగా ఆకుట్టుకుంది. ఎక్కడా బ్యాలన్స్ తప్పకుండా మంచి థ్రిల్లింగ్‌ గురిచేసే సినిమా అది. ఇలాంటి మంచి చిత్రం కథని మా జేఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం..’’ అంటూ తెలిపాడు. అయితే ఇందులో మరో హీరో గా ఎవరు నటిస్తున్నారనే సంగతి రివీల్ చేయలేదు. ‘అయ్యప్పనుమ్‌ కోషియుం’ కేవలం ఆరు కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా 60 కోట్లను రాబట్టింది. పృథ్వీరాజ్‌ ఇందులో మాజీ ఆర్మిఅధికారి కోషి గా నటించగా, బిజు మీనన్  నాజాయితీ కలిగిన పోలీస్ అధికారి అయ్యప్పన్ నాయర్ గా నటించాడు. లాక్‌డౌన్ ఎత్తివేయగానే సినిమాపై మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.

 

 

Leave a comment

error: Content is protected !!