ఉయ్యాలా జంపాల దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో ‘బాహుబలి’ ఫేమ్ రాకేష్ వర్రే కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జితేందర్ రెడ్డి’. ‘ప్రజలకు అతని కథ చెప్పాలి’ అన్నది ట్యాగ్ లైన్ . 1980లలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించ బడింది. జగిత్యాలకు చెందిన పోరాటయోధుడు జితేందర్‌రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం మే 30న థియేటర్లలోకి రానుంది.ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. చిన్నప్పటి నుంచి అభ్యుదయ భావంతో ఎదిగిన జితేందర్ రెడ్డి.. పేదల కోసం ఏం చేశారన్నదే ఈ సినిమా కథాంశమని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Leave a comment

error: Content is protected !!