Janvikapoor :  సుధాంశు సరియా దర్శకత్వం వహించిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘ఉలఝ్’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తై, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ చిత్రంలో అందాల జాన్వీ కపూర్‌తో పాటు, మలయాళ టాలెంటెడ్ యాక్టర్ రోషన్‌ మాథ్యూ, గుల్షన్‌ దేవయ్య, అదిల్‌ హుస్సేన్‌ కీలక పాత్రల్లో నటించారు. జంగ్లీ పిక్చర్స్ పతాకంపై వినీత్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఒక దేశభక్తురాలైన ఐఎఫ్‌ఎస్ అధికారి పాత్రలో జాన్వీ కపూర్ నటించింది. అనుకోని పరిస్థితుల్లో ఆమె దేశద్రోహం కేసులో చిక్కుకుంటుంది. ఆ కేసు నుండి ఎలా బయటపడుతుందనేది కథాంశం. ‘ఉలఝ్’ చిత్రం ఆగస్టు 2న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Leave a comment

error: Content is protected !!