Janvi kapoor : బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ ఒకరు. ఆమె ఇంతకు ముందు మిస్టర్ అండ్ మిసెస్ మహితో ఆడియన్స్ ను పలకరించింది. రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

ఈ చిత్రం గురించి జాన్వీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ స్పోర్ట్స్ డ్రామా లో నటించినందుకు తనని పెద్దగా ట్రోల్ చేస్తున్నారని వెల్లడించింది. ఒక వైద్యుడు తన పోస్ట్‌పై క్రికెట్ ఆధారిత చిత్రం చేయడానికి ఇలాంటి చెత్త నటిని తీసుకున్నారేంటి అంటూ వ్యాఖ్యానించాడు.

జాన్వీ కపూర్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడి ఒక సంవత్సరం పాటు క్రికెట్ నేర్చుకుంది. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆమె భుజాలకు కూడా గాయమైంది. ఈ సినిమా కోసం ఆమె కష్టపడడాన్ని అందరూ ప్రశంసించారు. అయితే తాను ఎంత చేసినా.. ఈ ట్రోల్స్ ఎప్పటికీ ఆగవని, కొన్నిసార్లు అవి పెద్దగా బాధిస్తాయని, అయితే జీవితంలో తాను కోరుకున్నది చేస్తూనే ఉంటానని జాన్వీ చెప్పింది.

Leave a comment

error: Content is protected !!