సీజన్‌ కు తగ్గట్టు సినిమాలొస్తుంటాయిదాన్నే సినీ పరిభాషలో ట్రెండ్ అంటుంటారు. ఇప్పుడిది ఎలక్షన్స్ సీజన్‌. సినిమాలకు పొలిటికల్ ట్రెండ్. ఓటర్లని చైతన్యం చేసే కథలు, తెరపై రంజైన రాజకీయాన్ని చూపించే సినిమాలకు బెస్ట్‌ సీజన్‌. అలాంటి కేటగిరీలో వస్తున్న మూవీ జనం. నేటిభారతం, దేశంలో దొంగలు పడ్డారు నాటి జ్ఞాపకాలు కళ్ల ముందు కదిలాయంటున్నారు సీనియర్‌ స్టార్‌ సుమన్‌. జనం మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు సుమన్‌. అజయ్‌ ఘోష్, కిశోర్‌, వెంకట రమణ, ప్రగ్యానైనా ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న జనం మూవీని వెంకటరమణ స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జనంమూవీ ట్రైలర్‌ ను హైదరాబాద్‌లో గ్రాండ్‌ గా లాంచ్‌ చేసారు.

అప్పుట్లో నేటి భారతం షూటింగ్ ఒంగోలు లో చేసాం.. ఇప్పుడీ జనం కూడా ఒంగోలు లో షూట్‌ చేసాం.. ఆనాటి జ్ఞాపకాలు కళ్లముందు కదిలాయంటున్నారు సుమన్.. సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు వాటికి పరిష్కారాలు.. వినోదంతో కూడిన మంచి సందేశాత్మక చిత్రంగా ఈ జనం వస్తుందంటున్నారు హీరో సుమన్‌.

ఈ ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్ర నటీనటులతో పాటు వి సముద్ర, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయి వెంకట్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a comment

error: Content is protected !!