నట భూషణ్ శోభన్ బాబు కు కెరీర్ కు మంచి బూస్టప్ నిచ్చిన చిత్రాల్లో ‘జగత్ జెట్టీలు ఒకటి. 1970 , జూన్ 18న విడుదలైన ఈ సినిమాకి కె.వి.నందనరావు దర్శకుడు. ఫాల్గుణా పిక్చర్స్ బ్యానర్ పై కె.ఏకామ్రేశ్వరరావు, కె.రాఘవ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సరిగ్గా నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇదే బ్యానర్ లో  అంతకు ముందు నిర్మించిన ‘జగత్ కిలాడీలు’ సూపర్ హిట్టవ్వడంతో .. అదే కేస్టింగ్ తో ఈ సినిమాను నిర్మించారు. వాణీశ్రీ కథానాయికగా నటించగా.. యస్వీఆర్ ఒక ప్రత్యేకమైన పాత్రతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు. గుమ్మడి, విజయలలిత, ప్రభాకర రెడ్డి, రాజబాబు, కె.వి.చలం తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. యస్పీ కోదండపాణి సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్నిఎంతగానో అలరించాయి. సొగసైన మల్లెపువ్వు.. చిరునవ్వు దివ్వె.. అంబ పలికింది.. లాంటి పాటలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

Leave a comment

error: Content is protected !!