Nandamuri Mokshajna : నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓ ముఖ్యమైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. అదేనండీ.. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ తెరంగేట్రం. అతడి ఎంట్రీ ఖాయమైనట్టే అనే వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదే కెమేరా ముందుకు వస్తున్నాడు. ఇటీవల జరిగిన ఒక వేడుకలో బాలయ్య సంకేతాలిచ్చారు. అందుకు సంబంధించిన సన్నాహాల్లో నందమూరి ఫ్యామిలీ ఉంది.

తాజాగా మోక్షజ్ఞ ఒక ఫోటో షూట్ లో పాల్గొనగా అవి బైటకి వచ్చాయి. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్ నడుస్తోంది. పలువురు యంగ్ డైరెక్టర్స్ మోక్షజ్ఞ కోసం కథలు రెడీ చేశారట. ఆ లిస్ట్ లో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఉన్నట్టు సమాచారం. మరి బాలయ్య ఎవరి కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ? అనే విషయం అందరికీ ఆసక్తిగా మారింది.

Leave a comment

error: Content is protected !!