ప్రముఖ తెలుగు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తండ్రి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు. వారు సంస్కృతాంధ్రలో పండితులు, రచయిత, విమర్శకులు గానూ ఖ్యాతిని సంపాదించుకున్నవారు. వారి జ్ఞాపకార్ధం ‘ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం’ పేరిట ప్రతీ యేటా అవార్డులతో ప్రతిభావంతులను సత్కరిస్తూ వస్తున్నారు. 2022 సంవత్సరానికి గానూ విలక్షణ కవి దర్పశయనం శ్రీనివాసాచార్య గారికి ఈ అవార్డుకు ఎంపిక చేసారు. శ్రీ కోడూరి విజయ్‌ కుమార్‌ గారు ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఆత్మీయ అతిధులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఇంద్రగంటి మోహనకృష్ణ స్వగృహంలో అవార్డు జ్ఞాపిక ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ పురస్కారంలో భాగంగా మెమెంటోతో పాటు 25 వేల రూపాయల నగదును ప్రదానం చేసారు. ఈ కార్యక్రమాన్ని శ్రీకాంతశర్మ గారి సతీమణి ఇంద్రగంటి జానకీబాలగారు ఆప్తవాక్యంతో ప్రారంభించారు. శ్రీనివాసాచార్య గార కవితా ప్రస్థానం గురించి కోడూరి విజయ్‌ కుమార్‌ అద్భుతంగా ప్రసంగించారు.
ఇంద్రగంటి మోహనకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఖదీర్ బాబు, సుబ్బరాయ శాస్త్రి, శ్రీమతి ఎ. విద్యాదేవి, ఒమ్మి రమేష్ బాబు, శ్రీమతి కె. సజయ తదితరులు వారి వారి స్పందనను తెలియజేసారు. ఇక శ్రీకాంత శర్మ గారి కుమార్తె ఇంద్రగంటి కిరణ్మయి వందన సమర్పణ చేశారు.

Leave a comment

error: Content is protected !!