Horror Thriller :  యు వీ టి హాలీవుడ్ స్టూడియో, శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా అశోక్ కుల్లర్ నిర్మాణంలో షిరాజ్ మెహది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘నిన్ను వదలను’. లియుబా పామ్, కుష్బూ జైన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ, అజయ్, అనంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా అలరించబోతోంది.

లియుబా పామ్ రష్యాలో పుట్టి పెరిగింది. ఆమె సింగర్ అండ్ ప్రొడ్యూసర్ . రష్యాలో సేవ్ ద చిల్డ్రన్ అని ఒక డాక్యుమెంటరీ ఫిలింకి నిర్మాతగా.. ఇంకా.. లవ్ ఓవర్ ఈవిల్ అనే టీవీ సిరీస్ కి రైటర్ కమ్ నిర్మాత గా వ్యవహరించారు. ఇప్పుడు స్ట్రైట్ తెలుగులో ‘నిన్ను వదలను’ అనే హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో మనల్ని పలకరించబోతోంది.

Leave a comment

error: Content is protected !!