Nikhil Siddhartha : యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి తెరకెక్కించిన మిస్టిక్ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ వసూళ్ళ వర్షం కురిపించిన ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని అందుకోవడంతో తెలుగు సినీ ప్రేమికులు ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చందూ మొండేటి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అదేమిటంటే, కార్తికేయ 3 సినిమా తప్పకుండా వస్తుందని చెప్పారు. అంతే కాకుండా, ఈ సినిమా పార్ట్ 2 కంటే మరింత అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా తెరకెక్కిస్తున్న తండేల్ సినిమా పూర్తయ్యాక, కార్తికేయ 3 సినిమాను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక హీరో .. నిఖిల్ సిద్ధార్థ ఈ సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేస్తూ, ఈ సినిమా విజయానికి కారణమైన చిత్ర బృందం అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు చందూ మొండేటి, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, డీవోపీ కార్తిక్ ఘట్టమనేని వంటి వారిని ప్రత్యేకంగా కొనియాడారు. కార్తికేయ సిరీస్ తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైనది. ఈ సిరీస్ కు మరో భాగం రాబోతున్న విషయం తెలుసుకుని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

Leave a comment

error: Content is protected !!