Harish Shankar : మాస్ మహారాజు రవితేజ , మాస్ దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక కర్నూలులో ఘనంగా జరిగింది. కొత్త అమ్మాయి భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. ప్రముఖ నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ… హరీశ్ శంకర్ ప్రతి విభాగాన్ని పక్కాగా పర్యవేక్షిస్తూ శ్రమిస్తుంటాడని, నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ ఇలా సినిమాలు తీస్తూనే ఉండాలని అన్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. ఆగస్టు 14 సాయంత్రం నుంచే ఈ సినిమా సందడి మొదలవుతుందని, అందరూ చూసి ఆస్వాదించాలని కోరారు.

దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ, రవితేజ తనకు దర్శకుడిగా జన్మనీ, పునర్జన్మనీ ఇచ్చిన కథానాయకుడని అన్నారు. చాలా ఏళ్ల తర్వాత రవితేజతో సినిమా కోసం సెట్‌కి వెళ్లినప్పుడు ఎక్కడా లేని ప్రశాంతత వచ్చిందని తెలిపారు. నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ సహకారంతోనే ఈ సినిమా ఇంత వేగంగా పూర్తి చేశామని అన్నారు. ఆగస్టు 15న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కూడా విడుదలవుతోందని, రెండూ చూసి విజయవంతం చేయాలని కోరారు. నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలతో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందని అన్నారు.

ఈ వేడుకలో మాజీ ఎంపీ టి.జి.వెంకటేశ్, ఎమ్మెల్యేలు గౌరు చరిత, బి.కె.పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మిక్కీ జె.మేయర్, ఆయనంక బోస్, భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, గిరిధర్, ప్రవీణ్, పృథ్వీ, భాను, బి.వి.ఎస్‌.రవి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత కేఆర్కే, సహనిర్మాత వివేక్‌ కూచిభొట్ల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమా రవితేజ, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో మూడో చిత్రం కావడంతో తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా విడుదలకు ముందు వేడుకతో ఆసక్తి మరింత పెరిగింది.

Leave a comment

error: Content is protected !!