లాస్టియర్ వరుణ్ తేజ్ తో తెరకెక్కించిన ‘గద్దలకొండ గణేశ్’ చిత్రంతో డీసెంట్ హిట్ సొంతం చేసుకున్నాడు మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ . ఇక ఈ ఏడాది మైత్రీ వారి బ్యానర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా ఆఫర్ అందుకున్న హరీశ్ .. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్ళే సన్నాహాల్లో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. హరీశ్ శంకర్ ఇప్పుడు మరో సూపర్ ఆఫర్ కైవసం చేసుకున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ 14రీల్స్ ప్లస్ ఈ సినిమా నిర్మించనుంది.

గతంలో ఇదే నిర్మాణ సంస్థలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘గద్దల కొండ’ చిత్రం తెరకెక్కించాడు హరీశ్‌. దీన్ని ఉద్దేశిస్తూ ‘ గద్దల కొండ గణేష్‌ తర్వాత మరోసారి పవర్‌ఫుల్‌ దర్శకుడు హరీశ్‌తో పనిచేసేందుకు ఆనందంగా ఉన్నాం. త్వరలోనే ఇతర వివరాలు తెలియజేస్తామ’ని ట్వీట్‌ చేసింది 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ. అయితే ఇందులో హీరోగా ఎవరు నటించబోతున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఆ హీరో ఎవరవుతారో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!