పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీర మల్లు’ సినిమా ప్రారంభమై నాలుగేళ్ళు అయింది. విడుదల గురించి ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్. అందులోనూ పాన్-ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే షూటింగ్ ఎన్నో సార్లు ఆగిపోవడంతో అభిమానులు ఈ మూవీపై ఆశలు వదులుకున్నారు. ఇలాంటి సమయంలో మేకర్స్ ఒక అదిరిపోయే టీజర్‌తో ముందుకు వచ్చారు.

ఈ కథ రెండు భాగాలుగా తెరకెక్కబోతోందని మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగానికి ‘హరి హర వీర మల్లు పార్ట్ 1: స్వోర్డ్ vs స్పిరిట్’ అని ట్యాగ్ లైన్ పెట్టారు. 97 సెకన్ల టీజర్ లో సినిమాలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాల్ని రివీల్ చేశారు. రాజులు, నవాబుల పాలనలో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారో చూపించారు. పవన్ మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే యోధుడిగా పరిచయమై ప్రజల పక్షాన నిలబడతాడు.

బాబీ డియోల్‌ను సినిమాలో మెయిన్ విలన్ గా పరిచయం చేశారు. ఆ దృశ్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ పీరియాడ్ డ్రామా ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. పవర్ స్టార్ ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు. కానీ మాట్లాడేది కీరవాణి సంగీతమే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ పీరియాడ్ డ్రామాలో అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రి మరియు ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా డైలాగ్‌లు రాశారు. ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కాబోతోంది.

Leave a comment

error: Content is protected !!