Gunasekhar : ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే దర్శకుడు గుణశేఖర్. తన సినిమాలతో ఎప్పుడూ కొత్తదనం చూపించడంలో ముందుంటారు. ఇప్పుడు ఆయన నుండి మరో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. “యుఫోరియా” అనే టైటిల్ తో ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు గుణశేఖర్ తెలిపారు.

ఈ చిత్రాన్ని గుణటీమ్‌వర్క్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. నీలిమా గుణశేఖర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాలో నటీనటుల ఎవరో టీం త్వరలోనే ప్రకటించనుంది. “చూడాలని ఉంది”, “ఒక్కడు”, “రుద్రమదేవి” వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన గుణశేఖర్ చివరిగా “శాకుంతలం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సమంత నటించిన ఈ పౌరాణిక చిత్రం ఆశించినంత విజయం సాధించకపోయినప్పటికీ, గుణశేఖర్ దర్శకత్వం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. కొంత గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ ఇప్పుడు “యుఫోరియా”తో మరోసారి తన ప్రతిభను మరోసారి  చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!