Viswam Teaser : మ్యాచో స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన ‘విశ్వం’ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ ఈ ఆసక్తిని మరింత పెంచింది. టీజర్‌లో వింటేజ్ శ్రీను వైట్ల మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. గోపీచంద్ యాక్షన్ సన్నివేశాలు, కామెడీ పంచ్‌లు ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి.

ముఖ్యంగా “మీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా.. నాకు గీతా ఆర్ట్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మరే ఆర్ట్స్ తెలియదు” వంటి డైలాగ్‌లు నవ్వులు పూయిస్తాయి. ‘వెంకీ’ సినిమా తరహా ట్రైన్ సీక్వెన్స్ కూడా టీజర్‌లో కనిపించడం విశేషం. ‘విశ్వం’ టీజర్‌ను చూస్తే, ఇది కామెడీ మరియు యాక్షన్‌తో కూడిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్ అని స్పష్టమవుతోంది. గోపీచంద్ తన యాక్షన్ మాస్ ఇమేజ్‌ను ఈ సినిమాలో మరోసారి నిరూపించేందుకు సిద్ధమయ్యాడు.

అందాల భామ కావ్య థాపర్ ఈ సినిమాలో గోపీచంద్‌కు జోడిగా నటిస్తుంది. ఆమె గ్లామర్ ట్రీట్ కూడా ఈ సినిమాలో ఉండబోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల ఇద్దరూ ఒకేసారి ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!