ప్రపంచాన్ని ఒణికిస్తోంది కరోనా వైరస్. మన దేశంలో రోజు రోజుకూ పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. దానికి ఒకటే మార్గం. వీలైనంత వరకూ ఇంట్లోనే గడపడం. లాక్ డౌన్ ను వంద శాతం పాటించడం. అలా ఇంటికే పరిమితమైన వాళ్ళలో రోజు కూలీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన రోజు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని దేశంలో కానీ ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవించినపుడు నేను సైతం అంటూ తమ వంతు బాధ్యతగా మన తెలుగు హీరోలు ఎపుడు ముందుంటారు. తాజాగా కరోనా కారణంగా పనులు లేకుండా పోయిన పేదలకు హీరో గోపీచంద్ తన వంతు సాయం అందించారు. దాదాపు వెయ్యికి పైగా కుటుంబాలకు ఒకనెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేసారు. కరోనాపై పోరాటంలో తనకు తోచిన విధంగా పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!