మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ లేటెస్ట్ గా మొదలైంది. రామ్ చరణ్, ఇతర ప్రధాన నటీనటులు ఈ షెడ్యూల్ లో యాక్టివ్ గా పాల్గొననుండగా, షూటింగ్ జనవరి 22, 2024 వరకు కొనసాగనుంది.
ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి, సునీల్, జయరామ్, మరికొందరు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, 2024 సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదల కానుంది. రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు మామూలుగా లేవు.

Leave a comment

error: Content is protected !!