Empuran : మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ ప్రయోగాత్మక కథలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంటారు. తాజాగా ఆయన ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ చిత్రంతో మరోసారి తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు.

‘లూసిఫర్’ సినిమా ఘన విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ గా ‘లూసిఫర్ 2’ తెరకెక్కుతోంది. ఇటీవల కొచ్చిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం, తాజాగా గుజరాత్ లో మరో షెడ్యూల్ ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్ లో చిత్రానికి కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ ఖురేషి అబ్రహం పాత్రలో నటిస్తున్నారు. మంజూ వారియర్, టొవినో థామస్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.

Leave a comment

error: Content is protected !!