మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్, మీనా జంటగా నటించిన మలయాళ  ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’. 2013లో విడుదలై..  మలయాళ ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన ఈ సినిమా కు దర్శకుడు జీతూ జోసఫ్. దాదాపు అన్ని దక్షిణాది భాషల్లోనే కాకుండా.. బాలీవుడ్ లో సైతం రీమేక్ అయి.. ఘనవిజయం సాధించిన ఈ సినిమా కు త్వరలో సీక్వెల్ రానుంది.

ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు శుభవార్త వినిపించింది చిత్ర బృందం. నిన్న మోహన్‌లాల్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘దృశ్యం 2’ సినిమాను ప్రకటించింది. ఆశీర్వాద్‌ సినిమాస్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మిస్తున్నారు.మోహన్ లాల్ తన అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో దృశ్యం 2 విషయాన్ని ఒక వీడియో రూపంలో అందించారు.

 

Leave a comment

error: Content is protected !!