Double Ismart : రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న “డబుల్ ఇస్మార్ట్” సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించి, కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

“ఇస్మార్ట్ శంకర్” సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌కు జోడిగా కావ్య థాపర్ నటించనుంది. సంజయ్ దత్, అలీ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి నిర్మించారు.

ఇప్పటికే “పుష్ప: ది రూల్” సినిమా ఆగస్టు 15న విడుదల కానుందని ప్రకటించారు. దీంతో రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజున పోటీ పడతాయా అనే చర్చ జరుగుతోంది. డబుల్ ఇస్మార్ట్ విడుదల తేదీ ఖరారవడంతో ఈ చర్చకు మరింత బలం చేకూరింది. “పుష్ప: ది రూల్” విడుదల వాయిదా పడుతుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.

 

Leave a comment

error: Content is protected !!