Dhanush 52 : తమిళ సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నటుడు, దర్శకుడు ధనుష్ మరోసారి దర్శకుడిగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల రాయన్ మూవీతో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న ధనుష్ ఇప్పుడు డాన్ పిక్చర్స్ అనే కొత్త నిర్మాణ సంస్థతో కలిసి చేస్తున్న కొత్త చిత్రం D52 ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుండటం విశేషం. ఈ చిత్రం ఒక నవల ఆధారంగా రూపొందనుందని సమాచారం.

హీరోకి ధీటుగా విలన్ పాత్రకు మంచి స్కోప్ ఉండడంతో నటుడు అరుణ్ విజయ్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా నిత్య మీనన్‌ను ఎంపిక చేయబోతున్నారు. డాన్ పిక్చర్స్ దాదాపు రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ధనుష్ కొత్త చిత్రం అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకులు ఎంతగానో ఉత్సాహంగా ఉన్నారు. ధనుష్ నటన, దర్శకత్వం, అరుణ్ విజయ్ విలనిజం, భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరింత వివరాలను నిర్మాత ఆకాష్ భాస్కర్ త్వరలోనే వెల్లడించనున్నారు.

Leave a comment

error: Content is protected !!