Dhanush 52 : తమిళ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటుడు ధనుష్‌ తన కెరీర్‌లో మరో అడుగు ముందుకు వేస్తున్నాడు. ఈ ఏడాది ‘కెప్టెన్‌ మిల్లర్‌’, ‘రాయన్‌’ లాంటి భిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించిన ధనుష్‌, తన 52వ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న సంగతి తెలిసిందే.

డాన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాజాగా ‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు ) అనే ఆసక్తికరమైన పేరును ఖరారు చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రంలో కథానాయికగా నిత్యామేనన్‌ నటిస్తున్నట్లు సమాచారం.  ఈ చిత్రం గురించిన పూర్తి వివరాలను చిత్రబృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. ప్రస్తుతం ధనుష్‌ ‘కుబేర’ చిత్రంలో బిజీగా ఉన్నారు. ధనుష్‌, నిత్యామేనన్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందనను పొందుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!