Devara : యంగ్ టైగర్ యన్టీఆర్ లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం “దేవర”. మరో మూడు నెలల్లో థియేటర్లలో యాక్షన్‌ హంగామా చూపించడానికి సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. చిత్రం ముగింపు దశకు చేరుకుంది తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను ఛాయాగ్రాహకుడు రత్నవేలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

రత్నవేలు అప్డేట్ ప్రకారం.. యన్టీఆర్ అండ్ సైఫ్‌లపై గోవా అడవుల్లో ఓ అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఈ యాక్షన్‌ సన్నివేశానికి ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్ దర్శకత్వం వహించారు. భారీ వర్షాలతో చిత్రీకరణకు అంతరాయం ఏర్పడినా, ఎన్టీఆర్, సైఫ్‌తో పాటు చిత్ర బృందం కృషితో దీన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

తదుపరి షెడ్యూల్ థాయ్‌లాండ్‌లోని కాబ్రీ దీవుల్లో జరగనుంది. అక్కడ ఎన్టీఆర్ మరియు జాన్వీలపై ఓ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఈ భాగంలో చిత్రీకరణ కోసం ఇద్దరూ ఇప్పటికే థాయ్‌లాండ్‌కు బయలుదేరారు. “దేవర” ఒక మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది మరియు రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం “దేవర: పార్ట్ 1” పేరుతో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!