‘సాహో’ లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి  తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్ , యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా జార్జియా షెడ్యూల్ ను లాక్ డౌన్ కు ముందు పూర్తి చేసింది చిత్ర యూనిట్.  పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా అత్యంత భారీగా తెరకెక్కుతోంది.

ఇక ఇప్పుడు ప్రభాస్ 21 విషయానికొస్తే.. అశ్వనీదత్ అల్లుడు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా స్థాయి బడ్జెట్  సినిమా త్వరలో చిత్రీకరణకు సన్నాహాలు మొదలయ్యాయి. సైంటిఫిక్ ఫిక్ష‌న్ గా హాలీవుడ్ స్టాయి టెక్నీషియ‌న్స్ ఈ  చిత్రానికి ప‌ని చేయ‌నున్నారు. ఇందులో ప్ర‌భాస్‌కు జోడీగా బాలీవుడ్ భామ దీపికా ప‌దుకునేని ఎంపిక చేశారన్నవార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడీ వార్త వాస్తవమేనని తేలిపోయింది. క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ అప్డేట్ మీద ఇటీవల  స్పందించింది. ప్ర‌భాస్‌తో దీపిక చాలా పెద్ద వార్త ఇది. మ‌రో బ్లాక్ బ‌స్టర్ మూవీని రూపొందించ‌డానికి మ‌రో బ్లాక్ బ‌స్టర్ కాంబినేష‌న్ సెట్టయింది. ఇక ఈ వెయిటింగ్‌ని త‌ట్టుకోలేను` అని కీర్తి సురేష్ కామెంట్ చేసింది.  అందుకే ఈ  కాంబో  ఖాయమని కన్ఫర్మ్ అయిపోయింది.  ఇక  ‘పీకే ` త‌ర‌హాలో ఓ ఏలియ‌న్ క‌థగా ఈ మూవీ వుండే అవ‌కాశం వుంద‌ని కూడా ఊహాగానాలు మొదలయ్యాయి.

 

 

 

 

 

 

Leave a comment

error: Content is protected !!