వికాస్, శాంతి జోడీగా డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మాణంలో వి 4 సినీ క్రియేషన్స్ పతాకం పై ప్రదీప్ అల్లు తెరకెక్కించిన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ చిత్రం “దర్శిని”. ఈ సినిమా మే 17న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి ఇటీవలే సెన్సార్స్ పూర్తయింది. సెన్సార్ వారు యూ/ ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ ఎల్ వి సూర్యం మాట్లాడుతూ ‘దర్శిని’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ ఏ ఇచ్చి సినిమా బాగా వచ్చింది అని ప్రశంచించారు. మే 17న సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం విడుదలకు సపోర్ట్ చేసిన దామోదర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేసాడు. మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు.

ముగ్గురు మిత్రులకి భవిష్యత్తుని చూపించే యంత్రం దొరికితే దానివల్ల వచ్చే పరిణామాలు, పర్యవసానాలే దర్శిని సినిమా. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం బాగా నచ్చుతుంది” అని తెలిపారు.

Leave a comment

error: Content is protected !!