టాలీవుడ్ లో కామెడీని డిఫరెంట్ గా పండించే దర్శకుల్లో రవిబాబు పేరు ముందు వరుసలో ఉంటుంది. తన ప్రతీ సినిమాకు ఏదో ఒక ప్రత్యేకతను ఆపాదించడం ఈ దర్శకుడికి ముందు నుంచీ ఉన్న ఒక అలవాటు. ఈ నేపథ్యంలో ఈ సారి ఆయన.. కరోనా వైరస్ ను తన కామెడీకి ఫుల్ వాడుకోడానికి సిద్ధమవుతున్నాడు. సినిమా పేరు ‘క్రష్’. ఇందులోని నటీనటుల ముఖానికి మాస్కులు వేసి ఒక పోస్టర్ ను.. హీరో హీరోయిన్స్ మాస్కులు ధరించి రొమాన్స్ చేసుకోవడం మరొక పోస్టర్ ను విడుదల చేసి.. జనవరిలో ‘క్రష్’ మూవీ విశేషాల్ని వెల్లడి చేసిన  రవిబాబు.. ఈ లాక్ డౌన్ టౌమ్ లో లేటెస్ట్ గా మరో పోస్టర్ ను విడుదల చేసి నెటిజెన్స్ కు షాకిచ్చాడు.  ఈ పోస్టర్ ను ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఒక అమ్మాయి తన కాళ్ళను షేవ్ చేసుకొంటూ ఉండగా…  మాస్కులు ధరించిన ముగ్గురు కుర్రోళ్ళు  ఆ దృశ్యాన్ని దొంగచాటుగా చూసే ఈ లుక్ కు అందరూ షాకవుతున్నారు.  ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పై రవిబాబు స్వీయ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న క్రష్ చిత్రాన్ని నిజానికి ఈ సమ్మర్ లో విడుదల చేయాలనుకున్నాడు. అయితే లాక్ డౌన్ వల్ల అప్పుడు కుదరలేదు. త్వరలోనే ఈ సినిమాను కంప్లీట్ చేసి .. విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు రవిబాబు. అన్ లాక్ 1.0 .. ఎక్సిట్ విత్ కేర్ కేప్షన్ తో తెరకెక్కుతోన్న క్రష్ మూవీ ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.

 

 

 

Leave a comment

error: Content is protected !!