మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ‘లాహే.. లాహే..’ సాగే గీతాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో చిరంజీవి స్టెప్స్ ప్రధాన ఆకర్షణ.

ఈ పాటలో ‘అర్ధనారీశ్వర ప్రేమలీలను’ వివరిస్తూ…

“మెళ్ళో మెలికల నాగుల దండ
వలపుల వేడికి ఎగిరి పడంగా
వంటి యిబుది జల జల రాలి పడంగా
సాంబడు కదిలిండే
అమ్మ పిలుపు కు సామి అత్తరు సెగలై
విల విల నలిగిండే”

అంటూ… రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం ఆకట్టుకుంది.   పాటలో చిరంజీవితో పాటు ప్రత్యేక ఆకర్షణగా సంగీత, కాజల్ అగర్వాల్ కనిపించారు. మణిశర్మ దాదాపుగా 15ఏళ్ల తర్వతా చిరంజీవి సినిమాకి స్వరాలు సమకూర్చడం విశేషం. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Leave a comment

error: Content is protected !!