లాస్ట్ ఇయర్ ‘సైరా’ మూవీతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి .. తదుపరి చిత్రాల విషయంలో చాలా స్పీడ్ గా వ్యహరిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలోని ‘ఆచార్య’ చిత్రం సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా వేసుకుంది చిత్రం. ఇక దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో మలయాళ లూసిఫర్ రీమేక్ తెరకెక్కనుందట. ఆపై..  బాబీ, మెహర్ రమేశ్ చిత్రాలు కూడా లైన్ లో ఉన్నాయి. అయితే వీటితో పాటు చిరంజీవి దృష్టి వెబ్ సిరీస్ మీద కూడా పడిందనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం అన్ని భాషల్లోనూ వెబ్ సిరీస్ హవా నడుస్తోంది. పలువురు ప్రముఖ నటులు వీటిలో నటించడానికి తెగ ఉత్సాహం చూపుతున్నారు. అయితే ఇంతవరకూ స్టార్ హీరోలు మాత్రం ఆ దిశగా ఆలోచించలేదు. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల వారి ఆలోచనలు మారుతున్నాయి. మంచి కథాకథనాలు ఉంటే .. వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమేనని సంకేతాలిస్తున్నారు. ఆ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ చిరు తో వెబ్ సిరీస్ నిర్మించడానికి ప్లాన్ చేస్తోందట. త్వరలోనే ఆ వివరాలు తెలుస్తాయట.

Leave a comment

error: Content is protected !!