కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది. పలు దేశాల ప్రజలు దాని బారిన పడ్డారు. ఆ పెను భూతం భారత్ కూ వ్యాపించి .. ఇక్కడ ప్రజల్నీ భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో పలు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కొందరు మృత్యువాత కూడా పడ్డారు. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీని కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు.

ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న‌ లాక్‌డౌన్‌లో టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం కూడా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. షూటింగ్స్ వగైరాలు లేక‌పోవ‌డంతో ఆయ‌న త‌న‌లోని చిత్ర‌కారుడ్నినిద్ర లేపారు. బ్ర‌హ్మానందం ఎంత‌గానో ఇష్ట‌ప‌డే ప్ర‌ముఖ ర‌చ‌యిత శ్రీశ్రీ ఫొటోను పెన్సిల్‌తో చిత్రీక‌రించారు. ఆ ఫొటోను బ్ర‌హ్మానందం త‌న‌యుడు, హీరో రాజా గౌత‌మ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. బ్ర‌హ్మానందం ప్ర‌స్తుతం కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘రంగ‌మార్తాండ‌’లో కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!