కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీని కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు బొమ్మలు గీసుకుంటున్నారు.

కొందరు ఇష్టమైన సినిమాలు చూస్తున్నారు. మరికొందరు వంటలు చేస్తూ క్వారంటైన్ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు.. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను సర‌దాగా గ‌రిటె ప‌ట్టాడు. కిచెన్ లోకి వెళ్లి  నాన్ వెజ్ వంట‌కం చేశాడు. త‌న పిల్ల‌లు, ఇత‌ర కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి బోయ‌పాటి వంట చేస్తున్న వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.  బీ ది రియ‌ల్ మెన్ ఛాలెంజ్ లో భాగంగా ఎన్టీఆర్, వెంక‌టేశ్ ఇల్లు శుభ్రం చేయ‌డం, తోట ప‌నులు చేయ‌డం, వంట చేసిన విష‌యం తెలిసిందే. వ‌రుణ్‌తేజ్‌, మ‌హేశ్ తోపాటు ప‌లువురు తార‌లు ఒక‌రికొక‌రు ఛాలెంజ్ ‌విసురుకుంటున్నారు.  

Leave a comment

error: Content is protected !!