ఒకప్పుడు టాలీవుడ్ లో భూమిక టాప్ మోస్ట్ హీరోయిన్. అప్పట్లో  దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించి మెప్పించిన ఆమె..  పెళ్ళి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. చాలా కాలం తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చింది. అయితే  ఈ సారి ఆ బ్యూటీ..  అక్క, వదిన , ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తోంది. ఇటీవల  ‘యం.సీ.ఏ , సవ్యసాచి, రూలర్’ చిత్రాల్లో నటించిన భూమిక ఇప్పుడు మరోసారి అక్కగా నటించబోతోంది. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న  ‘సీటీమార్’ లో గోపీచంద్ సహోదరి గా కనిపించనుందట.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళా జట్టుకు గోపీ కోచ్ గా నటించనుండగా..  తెలంగాణా కు చెందిన మహిళా క్రికెట్ జట్టుకు కోచ్ గా తమన్నా అభినయించనుందట. అయితే ఇందులో గోపీచంద్ అక్కపాత్రకు చాలా ప్రథాన్యత ఉందట. అందుకే దర్శకుడు సంపత్ భూమికను ఎంపికచేశాడని తెలుస్తోంది.  మణిశర్మ సంగీతం అందించనున్న ‘సీటీమార్’ చిత్రం ఈ సమ్మర్ లో విడుదల కానుంది.   

Leave a comment

error: Content is protected !!