స్పోర్ట్స్ పెర్సనాలిటీస్ పై బయోపిక్స్ తీయడం బాలీవుడ్ లో ప్రస్తుత ట్రెండ్ . ఇప్పుడీ మేనియా టాలీవుడ్ కు కూడా వ్యాపించింది. ఈ నేపథ్యంలో  తెలుగు వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి బయోపిక్  ను తెరకెక్కించడానికి టాలీవుడ్ లో సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ ఈ సినిమా గురించి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి ఈ బయోపిక్ ను తెరకెక్కించనుంది. ఇక ఇందులో కరణం మల్లీశ్వరి పాత్ర కోసం ముందుగా నిత్యామీనన్ ను సంప్రదించగా.. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ కు నో చెప్పింది. అలాగే.. తాప్సీ , రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. కానీ ఫైనల్ గా కరణం మల్లీశ్వరిపాత్రను బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ పోషించనుందని సమాచారం.

భూమి ఫెడ్నేకర్‌కు ఎలాంటి పాత్రల్లోనైనా ఇమిడిపోగలదనే పేరుంది. గ్లామరస్ గా  కనిపించడానికైనా లేదా సహజంగా నటించడానికి సరిగ్గా సరిపోతుందని చెప్పుకుంటున్నారు. భూమితో చిత్రబృందం ఇప్పటికే సంప్రదించారట. అందుకు ఆమె కూడా ఒప్పుకుందని తెలుస్తోంది.  ఈ నెల 15 నుంచి తెలంగాణలో షూటింగ్‌లు చేసుకోడానికి, పరిమితమైన సంఖ్యలో తారాగణం పాల్గొని చిత్ర షూటింగ్‌లు చేసుకోడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో  సాధ్యమైనంత త్వరగా నటీనటులు, సాంకేతిక వర్గాన్ని ప్రకటించి, ఈ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది.

 

Leave a comment

error: Content is protected !!