యువ హీరో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన “భజే వాయు వేగం” సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. డెబ్యూ దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం లేటెస్గ్ గా  సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందింది.

ఈ చిత్రంలో రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి రాధన్ సంగీతం, కపిల్ కుమార్ నేపథ్య సంగీతం అందించారు. మే 31న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా కార్తికేయ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. యువీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థకు ఇటీవల కాలంలో మంచి హిట్లు లేకపోవడంతో, ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మే 31న “భజే వాయు వేగం” సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!