Bhagyasri Borse : టాలీవుడ్ లోకి కొత్తగా అడుగు పెట్టిన గ్లామర్ ఫేస్ భాగ్యశ్రీ బోర్సే. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో భాగ్యశ్రీని చాలా అందంగా మెరిసిపోతోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటల్లో ఆమె అందం, నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటి తెలుగు సినిమాలోనే భాగ్యశ్రీ తన గ్లామర్ అపీరెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.

‘మిస్టర్ బచ్చన్’ సినిమా విజయవంతమైతే, భాగ్యశ్రీకి తెలుగు చిత్ర పరిశ్రమలో మరెన్నో అవకాశాలు లభించే అవకాశం ఉంది. కృతి శెట్టి, శ్రీలీల వంటి హీరోయిన్లు ఒక్క సినిమాతోనే పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇప్పుడు భాగ్యశ్రీ కూడా ఆ జాబితాలో చేరాలని చూస్తోంది. బాలీవుడ్‌లో అనుభవం ఉన్న జాన్వీ కపూర్‌తో పోలిస్తే.. భాగ్యశ్రీకి తెలుగులో ఇదే తొలి అవకాశం కావడం విశేషం.

తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్ల కోసం ఎల్లప్పుడూ పోటీ ఉంటుంది. ఒకవేళ ఒక కొత్త ముఖం ఆకట్టుకుంటే ఆమెకు వెంటనే అవకాశాలు వెల్లువలా వస్తాయి. ప్రస్తుతం భాగ్యశ్రీ కూడా ఆ పోటీలో ఉంది. ఆమె తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పించి, తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుందని ఆశిద్దాం. కృతి శెట్టి, శ్రీలీల వంటి హీరోయిన్ల మాదిరిగానే భాగ్యశ్రీ కూడా ఒక్క సినిమాతోనే పాపులర్ కావాలని చూస్తోంది. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా విజయం భాగ్యశ్రీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

Leave a comment

error: Content is protected !!