Bhagyasri Borse : రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్‌తో మోడల్ అండ్ యాక్ట్రెస్ అయిన భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం హిందీ సూపర్ హిట్ ‘రైడ్‌’ కి రీమేక్. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్‌లో మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

తన తొలి చిత్రం విడుదల కాక ముందే భాగ్యశ్రీ బోర్సే రెండు కొత్త చిత్రాలకు సంతకం చేసింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం సెట్స్‌లో కూడా భాగ్యశ్రీ చేరింది. ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో ఒక నెల పాటు జరిగింది . నిజానికి ఈ చిత్రంలో శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సే ను తీసుకున్నారు . ఆమె షూటింగ్‌లో పాల్గొంది.

భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు తన మూడవ తెలుగు చిత్రానికి సైన్ చేసింది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌తో అతని తదుపరి స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో జతకట్టింది. రవి అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం అమెరికాలో జరగనుంది.

Leave a comment

error: Content is protected !!