Bellamkonda srinivas : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఆఖరుగా వివి వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి హిందీ వెర్షన్ లో నటించాడు. ఈ సినిమా ఆశించిన రీతిలో ఆకట్టుకోలేదు. ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు మూవీలో నటిస్తున్న శ్రీనివాస్ లేటెస్ట్ గా తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించాడు. “చావు కబురు చల్లగా” డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాహు గారపాటి నిర్మాత. బెల్లంకొండ శ్రీనివాస్ కు ఇది 11వ చిత్రం.

సోమవారం ఉదయం 10:30 గంటలకు పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ప్రారంభం . ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. “దైవ ఆశీర్వాదాలతో ఉత్తేజకరమైన ప్రారంభం” అంటూ ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. పోస్టర్ చూడగా సినిమా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి రాక్షసుడు సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

కాంతార, విరూపాక్ష, మంగళవారం వంటి సినిమాలకు పనిచేసిన ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చిన్మయి సలస్కర్ సినిమాటోగ్రాఫర్ గా, మనీషా ఏ దత్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!