టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరో నట సింహ బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఎపుడు తెలుగు రాష్ట్రాల్లో గాని దేశంలో కానీ ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవించినపుడు నేను సైతం అంటూ మానవత్వాన్ని చాటుకునే హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కరోనా లాక్‌డౌన్ కారణంగా పనిలేకుండా పోయిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికుల కోసం మొత్తంగా రూ. 1 కోటి 25 లక్షల విరాళం అందించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా బాలకృష్ణ తనకు సంబంధించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో   హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు 400 మంది హౌస్ కీపింగ్ వాళ్లకు నందమూరి బాలకృష్ణ కమోడిటీ కిట్స్, నిత్యావసర వస్తువులు  అందజేసారు. సంస్థలో పనిచేస్తున్న వారందరి సేవలను ప్రోత్సహించేలా వాటిని అందజేసినట్టు బాలకృష్ణ తెలిపారు.

Leave a comment

error: Content is protected !!