దర్శకధీరుడు రాజమౌళి మలిచిన అద్భుత జానపద చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ‘బాహుబలి 1, 2’ రెండు భాగాలు భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో నిలిచాయి. ఈ సిరీస్ మరో భాగం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. అయితే, ‘బాహుబలి’ పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ రాబోతోంది. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో వస్తోన్న ఈ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ లేటెస్ట్ గా విడుదలైంది.

‘బాహుబలి’ మరో కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ అనే టైటిల్ తో ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. ఇది పూర్తిగా కొత్త కథతో రూపొందడం గమనార్హం. ఒక విధంగా చెప్పాలంటే, ‘బాహుబలి: ది బిగినింగ్, ది కంక్లూజన్’లకు ప్రీక్వెల్ గా ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ వస్తోందని చెప్పవచ్చు.

జీవన్ జె. కాంగ్, నవీన్ జాన్ లు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను రాజమౌళి, శోభు యార్లగడ్డ, దేవరాజన్ లు సంయుక్తం గా నిర్మించారు. ఈ సిరీస్ పలు భాషల్లో మే 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి దర్శకధీరుడు రాజమౌళి రంగంలోకి దిగుతున్నాడు.

Leave a comment

error: Content is protected !!