క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ జానర్‌లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. మొదటి సారిగా క్లూస్ టీం ప్రాముఖ్యతను చూపించేలా ‘అథర్వ’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో హీరో కార్తీక్ రాజు మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు మహేష్ రెడ్డి గారిని పది నిమిషాలు కథ చెప్పమన్నాను. కథ ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో.. ఆ చర్చలు మూడు గంటల పాటు జరిగాయి. విన్న వెంటనే కథ బాగా నచ్చింది. అలా అథర్వను ప్రారంభించాం. ఇందులో హీరో పాత్రకు ఆస్తమా ఉంటుంది. అందుకే పోలీస్ అవ్వాలనే కోరిక ఉన్నా కాలేకపోతాడు. చివరకు క్లూస్ టీంలో జాయిన్ అవుతాడు.
నిర్మాతలు (శ్రీనివాస్, సుభాష్) ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సినిమాకు సెట్లు కావాలంటే సెట్లు వేయించారు. మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నీ కూడా ఒకే ఫార్మాట్‌లో ఉంటాయి. కానీ ఈ మూవీలో ఎలాంటి క్లూస్ లేని ఓ కేసుని ఎలా పరిష్కరించారు అనేది ఆసక్తిరకంగా ఉంటుంది. అదే ఈ సినిమాలో కొత్త పాయింట్. ఇలాంటి జానర్లో నటించే టైంలో ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. మన నటన మీదే సినిమా అంతా ఆధారపడి ఉంటుంది. నాకు ఈ పాత్ర చాలెంజింగ్‌గా అనిపించింది.

Leave a comment

error: Content is protected !!