Ashika Ranganath : అమిగోస్ చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల ఆషికా రంగనాథ్. ఇటు గ్లామర్ పరంగానూ, అటు పెర్ఫార్మెన్స్ పరంగానూ అద్భుతమైన టాలెంట్ ను సొంతం చేసుకున్న అమ్మడు.. నా సామిరంగ’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించింది ఈ కన్నడ సుందరి.

ప్రస్తుతం చిరంజీవితో ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తోంది. ఈమె మరో కొత్త అవకాశం దక్కించుకుంది. సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ఓ కొత్త చిత్రానికి ఆమెను నాయికగా ఎంపిక చేశారు. దర్శకుడు ఎన్‌.రాజశేఖర్ ఈ చిత్రానికి ‘మిస్ యు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు ఈ కథలో భాగమైనందుకు ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు.

Leave a comment

error: Content is protected !!