Anjali :  హీరోయిన్‌గానూ, విలక్షణ పాత్రల్లోనూ తన టాలెంట్ చూపించే హీరోయిన్ అంజలి. లేటెస్ట్ గా ఆమె మెయిన్ లీడ్ లో జీ5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై సంయుక్తంగా తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌కు దర్శకుడు. గ్రామ కక్షలు మెయిన్ థీమ్ గా ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘బహిష్కరణ’ యూనిట్ మీడియా మీట్ నిర్వహించింది. హీరోయిన్ అంజలి, దర్శక, నిర్మాతలు సినిమా విశేషాలు పంచుకున్నారు.

పిక్సెల్ పిక్చర్స్ ప్రై. లి. అధినేత, నిర్మాత ప్రశాంతి మలిశెట్టి.. ‘జీ5తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. జీ5తో మాకు లోకల్ కథలను గ్లోబల్ వైడ్‌గా చెప్పగలమనే నమ్మకం ఏర్పడింది. అంజలి ఇది వరకెన్నడూ చేయనటువంటి, పోషించనటువంటి పాత్రలో కనిపిస్తారు.మా దర్శకుడు ముఖేష్ ప్రజాపతి, అసాధారణమైన కథతో, ఎంతో లోతైన ఎమోషన్స్‌తో మరెంతో ఉద్వేగభరితమైన వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. మన సమాజంలోని వాస్తవికతలను, పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ సిరీస్ ఉండనుంది. ZEE5 వంటి జాతీయ ప్లాట్‌ఫాంలలో ప్రాంతీయ కంటెంట్‌లకు ప్రాధాన్యత పెరిగింది. మా సిరీస్‌ దేశ వ్యాప్తంగా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నామ’ అని అన్నారు.

Leave a comment

error: Content is protected !!