Shopping Cart 0 items - $0.00 0

కృష్ణ ‘అందరికంటే మొనగాడు’ చిత్రానికి 35 ఏళ్ళు పూర్తి

సూపర్ స్టార్ కృష్ణ నటజీవితంలో ఒక ప్రత్యేకమైన చిత్రం ‘అందరికంటె మొనగాడు’. తోట కృష్ణ దర్శకత్వంలో శ్రీ అజంతా సినీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీరామ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 1985, ఏప్రిల్ 25న విడుదలై.. తెలుగునాట ఘన విజయం సాధించింది. నేటికి సరిగ్గా 35 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏడుగురు అన్నదమ్ముల కథగా తెరకెక్కింది. జయసుధ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఈశ్వరరావు, రాజా, మాడా, మిశ్రో , రాంజీ , శుభాకర్ కృష్ణ తమ్ముళ్ళు గా నటించారు. ఇక  ఇందులో  ప్రభాకరరెడ్డి, నరసింహరాజు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అన్న పెళ్లి చేస్తే తమ జీవితాలు కూడా బాగు పడతాయని .. అన్నపెళ్ళి కోసం ప్రయత్నించడం .. ఆపై జరిగే పరిణామాలు అందరికంటే మొనగాడు చిత్ర కథ. నిజానికి ఈ సినిమా 1982 లో బాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘సత్తే పే సత్తా’ చిత్రానికి ఫ్రీమేక్ వెర్షన్. అంతేకాదు ఇదే సినిమా చాన్నాళ్ళ తర్వాత మళ్లీ తమిళంలో అజిత్ హీరోగా ‘వీరం’గా రూపొందింది. అదే సినిమా ఇక్కడ పవన్ కళ్యాణ్ తో ‘కాటమరాయుడు’గా తెరకెక్కింది.

 

Leave a comment

error: Content is protected !!