Anasuya : ‘జబర్థస్త్’ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ తాజాగా సోషల్ మీడియాలో ఒక నెటిజన్ కు ధీటుగా కౌంటర్ ఇచ్చింది. ఆమె గురించి ‘ఎక్స్‌’లో పోస్ట్ పెట్టిన ఆ నెటిజన్ ను అనసూయ తనదైన శైలిలో ఎదుర్కొంది. అసలు విషయం ఏమిటంటే, అనసూయ పాల్గొన్న ఒక టీవీ కార్యక్రమం క్లిప్ ను షేర్ చేస్తూ ఒక నెటిజన్ “ఏంటీ నాన్సెన్స్ అనసూయ..? ఏదైనా అంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు” అని పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ లో వాంతి చేసుకున్నట్లు కనిపించే ఎమోజీలను కూడా జోడించాడు.

ఈ పోస్ట్ ను చూసిన అనసూయ ఆ నెటిజన్ కు “మీరు ఇలా తీవ్ర అనారోగ్యంగా ఉండటానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? ఎమోజీ, మీ మైండ్ విషయంలో…” అని వ్యంగ్యాస్త్రాలు విసురుతూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం బుల్లితెర నుంచి వెండితెర మీదకు ఎంట్రీ ఇచ్చిన అనసూయ అక్కడ కూడా ఫుల్ డిమాండ్ తో దూసుకుపోతోంది. సినిమాలతో పాటు పలు టీవీ షోలలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా గడుపుతోంది. అనసూయ రిప్లైకి నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొందరు ఆమెకు మద్దతుగా మాట్లాడుతూ, నెటిజన్ చేసిన వ్యాఖ్యను తప్పు పట్టారు. మరికొందరు నెటిజన్ అభిప్రాయంతో ఏకీభవించారు.

Leave a comment

error: Content is protected !!