కరోనా వల్ల కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోడానికి మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసంను ప్రారంభించారు. ఇప్పటికే ఈ సంస్థకు సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న పెద్ద అని తేడా లేకుండా పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు. ఇప్పటివరకూ దాదాపు రూ. 8కోట్లు సమకూర్చి.. సినీ కార్మికులకు నిత్యావసర వస్తువుల్ని అందిస్తూ ఆదర్శంగా నిలిచారు.

టాలీవుడ్ సిసిసి పేరుతో  ఇలా కార్మికులకు సాయం అందిస్తూండడాన్ని బిగ్ బి అమితాబ్ ప్రశంసించారు. దాదాపు  12వేల మంది రోజువారీ కార్మికులకు సాయం చేయడం చాలా గొప్పపని అని, మానవత్వం పరిమళించే ఈ సత్కార్యాన్ని చేస్తున్నందుకు  తాను సిసిసికి అభినందనలు తెలుపుతున్నానని అమితాబ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపారు.

Leave a comment

error: Content is protected !!